![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -170 లో.... ధీరజ్ దగ్గరికి ప్రేమ వస్తుంది. నువ్వు మీ నాన్న అన్న మాటలకి ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసని ప్రేమ అంటుంది. నాన్న అన్న దాంట్లో కూడా నిజం ఉంది. ఎందుకంటే నాన్న కష్టపడి పైకి వచ్చాడు. అలా మేం కూడా వస్తేనే కదా మాకు గౌరవమని ధీరజ్ అంటాడు.
ఖచ్చితంగా నాకంటూ ఒక పేరు సంపాదించుకుంటా అని ధీరజ్ అంటాడు. దాంతో ప్రేమ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొకవైపు సాగర్ ని వేరొక జాబ్ చూసుకోమని నర్మద చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ భాగ్యానికి శ్రీవల్లి ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంది. నేను చెప్పినట్లు చెయ్ అని భాగ్యం శ్రీవల్లి కి ఏదో చెప్తుంది. ఆ తర్వాత శ్రీవల్లి ఏడుస్తూ గదిలోకి వస్తుంది. ఏమైందని చందు అడుగుతాడు. మావయ్య కి ఫొటోస్ చూపించానని నర్మద నన్ను తిట్టిందని చందుతో చెప్తుంది శ్రీవల్లి.
మరుసటి రోజు రామరాజు మిల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. అప్పుడే ధీరజ్ కాలేజీ కి రెడీ అవుతాడు. బైక్ దగ్గరికి వచ్చేసరికి రామరాజు అన్న మాటలు గుర్తుచేసుకొని 'కీ' వేదవతికి ఇచ్చేసి నడుచుకుంటూ వెళ్తాడు. చూసారా మీరు అన్న మాటలకి వాడు ఎంత బాధ పడ్డాడోనని రామరాజుతో వేదవతి చెప్తుంది. నేను వాళ్ళకి బాధ్యత తెలియడానికే కదా అలా అన్నది అని రామారాజు అంటాడు. తరువాయి భాగంలో ధీరజ్ ఫుడ్ డెలివరీ కి వెళ్తాడు. అక్కడ ధీరజ్ ని విశ్వ అవమానిస్తుంటే అప్పుడే ప్రేమ వచ్చి విశ్వతో గొడవపడుతుంది. నీకు సంబంధం లేదని విశ్వ అంటుంటే.. ధీరజ్ నా మొగుడు అని ప్రేమ అంటుంది. అది విని ధీరజ్ ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |